లట్టుపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు

 *లట్టుపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు*

 41 ఫిర్యాదుల స్వీకరణ .- తహసిల్దార్ మునరుద్దీన్


 బిజినపల్లి, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని లట్టుపల్లిలో మంగళవారం నాడు రైతు వేదిక దగ్గర భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. బిజినపల్లి మండల తాహసిల్దార్ మునురుద్దీన్ రైతుల నుంచి 41 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నచో లట్టుపల్లి గ్రామంలో రైతు వేదిక దగ్గర బుధవారం నాడు కూడా అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ ప్రాంత రైతులు భూ సంబంధిత ఫిర్యాదులు స్వయంగా వచ్చి అందజేయాలని దరఖాస్తుతో పాటు సంబంధిత నకలు ధ్రువపత్రాలు జతపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు గోవిందునాయక్, మాజీ ఎంపిటిసిలు శివలీల, చంద్రగౌడ్, శ్రీశైలం, మాజీ సర్పంచులు వెంకటయ్య, చందులాల్, పాండు, శంకర్, శాంతి, కృష్ణ, భారతి, అమర్, శీను నాయక్, భరత్, పిట్యా, భాష, రవీందర్, జాహంగిర్, తదితరులు ఉన్నారు.

Previous Post Next Post