జర్నలిస్టుల మహాసభ జయవంతంగా ముగిసిన జిల్లా మూడవ మహాసభలు

 విజయవంతంగా ముగిసిన జిల్లా మూడవ మహాసభలు

 ప్రమాదంలో స్వేచ్చా ప్రజాస్వామ్యం

 టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్న య్య  

 ప్రశ్నార్థకంగా మారిన జర్నలిస్టుల ఐక్యత

 టి డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ

 విజయవంతంగా ముగిసిన జిల్లా మూడవ మహాసభలు  దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టుల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని, అందులోనూ జర్నలిస్టుల ఐక్యత ప్రశ్నార్థకంగా మారుతోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ అన్నారు. 

వనపర్తి, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీవో సమావేశ భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మూడవ మహాసభలు అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ అశోక్ అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య, తాటికొండ కృష్ణ మాట్లాడుతూ గత ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏర్పడిందని గుర్తు చేశారు. సంఘం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల కోసం ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. గతంలో పనిచేసిన, ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది జర్నలిస్టులు పాతిక, 30 సంవత్సరాలకు పైగా పని చేసినా నేటికీ ఇందిరమ్మ ఇండ్లు గాని, ఇండ్ల స్థలాలు గాని కేటాయించకపోవడం అన్యాయమన్నారు. సామాన్యులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులపై అధికార, విపక్ష నాయకులు దాడులకు పాల్పడటం విచారకరమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోరే జర్నలిస్టు మిత్రులు వారి కుటుంబాల యోగక్షేమాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ముందిండి నడిపించిన జర్నలిస్టులకు గత సీఎం కేసీఆర్ ఏమాత్రం న్యాయం చేయలేకపో యారని ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టులంతా పారదర్శకంగా, నీతి నిజాయితీగా ప్రజా సమస్యలపై గలమెత్తుతూ సామాన్యులకు న్యాయం చేసే విధంగా కథనాలను ప్రచురించాలని ఈ సందర్భంగా సూచించారు. జర్నలిస్టులను ఆయా సంస్థలు గుర్తించి వార్త కథనాలు రాయించుకుంటూ ఇచ్చే గుర్తింపు కార్డులను అధికార యంత్రాంగం పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. అక్రిడేషన్ కార్డుల కాల పరిమితి అయిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పొడిగించడం దారుణమని, ఇప్పటికైనా కొత్త అక్రిడిటేషన్ కార్డులను, రైల్వే పాసుల రాయితీని వెంటనే జర్నలిస్టులందరికీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రెస్ అకాడమీ జర్నలిస్టులను విచ్ఛిన్నం చేయకుండా, వివక్ష చూపకుండా ప్రతి జర్నలిస్టుకు శిక్షణ, నైపుణ్య తరగతులు నిర్వహించాలని వృత్తిపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అందుకోసం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని అక్రిడేషన్ కార్డుల కంటే వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉందని, ఈ జర్నలిస్టులంతా ఐక్యమత్యంగా సమస్యలపై పోరాడి సాధించుకోవాలని గుర్తు చేశారు. గత 30 ఏళ్ల క్రితమే వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెబ్బేరు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పడి ఐక్యంగా ఉండి దాదాపు 50 మంది విలేకరులు ఇండ్ల స్థలాలు, ఇండ్లను సాధించుకున్నారని, ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నామని తెలిపారు. సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయని వాటిపైన ఐక్యంగా పోరాడేందుకు కనీసం వందమంది కలిసి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఉమ్మడిగా ఉంటూ ఐక్యంగా సమస్యల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని కార్యాచరణ అమలు కోసం కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్ ప్రభు, రాష్ట్ర కమిటీ సభ్యులు పరిపూర్ణం, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రామచందర్, సీనియర్ జర్నలిస్టులు రమేష్, పూరి సురేష్ శెట్టి, పత్రికల విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు. 

 టిడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా నూతన కార్యవర్గాన్ని మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకుల సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా జూటూరు రాము (నవతెలంగాణ), కార్యదర్శి గా అక్కల శ్రీనివాస్ గౌడ్ (మెట్రో ఈవినింగ్), ఉపాధ్యక్షులుగా కే సురేందర్ గౌడ్ ( మాటీవీ), పెరుమళ్ళ వెంకటేశ్వర్లు (సత్యవార్త), పొర్ల రవీందర్ గౌడ్ (ఆంధ్రజ్యోతి), సహాయ కార్యదర్శులుగా చారగొండ బాబు (ప్రజా సాక్షి), బక్కి బాబు (నవతెలంగాణ), ఎన్. నాగభూషణం (తెలుగు సత్తా), కోశాధికారిగా పి శ్రీనివాసులు (సత్యవార్త), ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పోతులపల్లి వెంకటేష్ (మెట్రో ఈవినింగ్), ఈసీ మెంబర్లుగా పెబ్బేటి రాము (టీవీ 6), పోతుగంటి విష్ణు ( అభినయ), ఆత్మకూర్ గోపాల్ (మెట్రో ఈవినింగ్ ), గుంటి విష్ణువర్ధన్ (రాజముద్ర ), కే వెంకటేష్ నాయక్ ( సత్య వార్త), జి రవికుమార్ చారి (ఉదయం), మన్మోహన్ (నవతెలంగాణ), బాలకృష్ణ (మెట్రో ఈవినింగ్), పెద్దిగారి రంజిత్ (పీపుల్స్ మోటివేషన్) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా పెద్దిగారి స్వామి (సత్యవార్త), జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా పూరి సురేష్ శెట్టి (మన తెలంగాణ), ఈనాడు రమేష్ (వాయిస్ ఆఫ్ వర్డ్స్), చిన్న పత్రికల అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ గా వి. అశోక్ కుమార్ (సత్యవార్త) లను జిల్లా మహాసభలో ఎకగ్రివంగా ఎన్నుకున్నారు.

Previous Post Next Post