చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్
మిడ్జిల్, జూన్ 22 (మనఊరు ప్రతినిధి): చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాణిపేట గ్రామ కమిటీ అధ్యక్షులు కర్నికోట మల్లేష్ అన్నారు. సోమవారం మండలంలోని రాణిపేట గ్రామానికి చెందిన జక్క బీరయ్య కుమారుడు జక్క కిరణ్ కుమార్ సాఫ్ట్ బాల్ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. శారీరక ధారుడ్యం కోసం ప్రతీ ఒక్కరు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నా రు. జక్క కిరణ్ కుమార్ హైదరాబాద్ లోని ఏవీ కళాశాలలో ఆర్గానిక్ కె మిస్ట్రీలో పీజీ చేస్తూ సాప్ట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దానికి వెనకాల ఎంతగానో కళాశాల యజమాన్యం, కళాశాల ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్ బాల్ కోచ్, వారి తల్లిదండ్రుల కృషి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్, అమీర్, ఇస్మాయిల్, మల్ల పోగుల శీను, హెచ్ఎమ్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.