అన్నదాతలకు ముఖం చాటేసిన వరుణుడు
కొన్ని మొలికెత్తి మరికొన్ని మొరకెత్తక విలవిలలాడుతున్న రైతులు
అయోమయంలో రైతులు
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న వరుణుడు
జడ్చర్ల, జూన్ 23 (మనం న్యూస్) : రుతుపవనాలు ముందే రావడంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. గత 12 రోజుల క్రితం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక వర్షాలు కురుస్తాయనే ఆశతో విత్తనాలు విత్తారు. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతుండడంతో పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తొలకరి వర్షాలు కురియడంతో పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటిన రైతులు, తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి కొన్ని మొలకెత్తి మరికొన్ని మొలకెత్తే సమయంలో అన్నదాతలకు వరుణుడు మొఖం చాటేయడంతో రైతులు అయోమయంలో పడ్డారు ఖరీఫ్ పంట కాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తొలకరి జల్లులను నమ్ముకొని వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు ఎండలకు వాడిపోతున్నాయి. ఇక కొత్తగా విత్తనాలు వేసేందుకు భూమిలో పదును లేదు. కాగా దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వర్షం ఎప్పుడు పడుతుందా విత్తనాలు ఎప్పుడు వేద్దామా అని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరి కోతల సమయంలో వర్షాలు అధికంగా కురిసి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం పత్తి, మక్కలు విత్తనాలు విత్తె సమయంలో అన్నదాతలకు వరుణుడు మొఖం చాటేసి రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట ఎదగాల్సిన సమయంలో ఎదగకపోవడంతో దిగుబడి అధికంగా తగ్గి రైతులు నష్టాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి అసలే వ్యవసాయంలో ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా వరుణుడు రైతులతో దాగుడుమూతలు ఆడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పత్తి, మక్కలు విత్తనాలు తీసుకువచ్చి భూమిలో విత్తనాలు వేయగా వర్షాలు సరైన సమయంలో కురవకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి మొలకెత్తి ఎదుగుదల ఆగిన మొక్కలను పరీక్షించి రైతులను ఆదుకోవాలని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.