మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి

 మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి

జడ్చర్ల రూరల్, జూన్ 14 (మనఊరు ప్రతినిధి): వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో వినాయకుని విగ్రహాల వ్యాపారం చేసే వారికి ఆశలు చిగురిస్తాయి. కానీ జడ్చర్ల పట్టణంలో అకాల వర్షంతో గణేష్ నగర్ లోని చేతివృత్తుల వారు తయారు చేసే మట్టి గణపతి బొమ్మలు వర్షపు నీరు షెడ్డులోకి రావడంతో అపార నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని తెలుసుకున్న 24వ వార్డ్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ అకాల వర్షానికి పాడైపోయిన మట్టి వినాయకుని ప్రతిమలను చూసి బాధితులను పరామర్శించి కుమ్మరి రాధకు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు. మానవత్తవం చాటుకోవడంతో కులవృత్తికి చెందిన కుటుంబ సభ్యులు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Previous Post Next Post