తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది

 *తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది* 

*తెలంగాణ హక్కుల కోసం, నీళ్లలో మన వాటా కోసం, ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం పై ఆయన చేసిన పోరాటం నేటికీ ఆదర్శనీయం* 

*బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి 

*ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన లక్ష్మారెడ్డి 



జడ్చర్ల రూరల్, జూన్ 21 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ తొలి దశ ఉద్యమం నాటి నుంచి రాష్ట్ర సాధన సాధ్యమైనంతవరకు తెలంగాణ హక్కుల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికీ అప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన వైపు తెలంగాణ ప్రజలను మలిపిన ప్రముఖులు జయశంకర్ సార్ అని అన్నారు. 1952 నుంచి నాన్ ముల్కి, ముల్కీ ఉద్యమానికి తెరలేపి సీమాంధ్ర ప్రాంత నేతల ఆధిపత్యాని వ్యతిరేకించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పి విద్యార్థులను, మేధావులను, ఉద్యోగస్తులను తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా అవగాహన కల్పించారని తెలిపారు. సాగునీళ్ళు, ఉద్యోగాలు, నిధులు వంటి అంశాలలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి క్షుణ్ణంగా తెలియజేసి ఉద్యమం వైపు మళ్లించారని ఉపయోగపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సూచనతో కెసిఆర్ సారథ్యంలో జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించుకునే అంతవరకు విశ్రమించకుండా పని చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రాంతం ఉన్నంత కాలం ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును మర్చిపోలేరని, ఆయన మన మధ్యలో భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన పేరు మన మనస్సుల్లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Previous Post Next Post