*ఆరోగ్యమే మహా భాగ్యం*
*యోగా చేయండి... ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి*
*ప్రపంచానికే యోగ ను పరిచయం చేసిన మన ప్రధాని మోదీ*
*బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్*
మహబూబ్ నగర్, జూన్ 21 (మనఊరు ప్రతినిధి): ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుష్షు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి వారసత్వ క్షేత్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా భండారి శాంతి కుమార్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాలోని పురాతన చరిత్రను ప్రతిబింబించే పిల్లల మర్రి వారసత్వ క్షేత్రం లో, నిర్వహించిన యోగా ఉత్సవం ఎంతో స్ఫూర్తిదాయకమైందని, ఇది మన సంస్కృతికి మనం ఇచ్చే గౌరవం, యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు–ఇది భారతీయ ఆరోగ్యం, నియంత్రణ, అధ్యయనం, అవగాహనలకు మార్గదర్శకం భారత దేశ సంస్కృతిలో యోగా ఒకటి అని దాన్ని అందరూ మరిచిపోయిన వేళ మరల ప్రజలకు దగ్గరచేసి పునర్జీవం పోసిన మన ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతో అద్భుతంగా మేలు చేస్తుందని , ప్రస్తుత పరిస్థితుల్లో యోగా మనిషి జీవన శైలికి ఎంతో అవసరమని తెలిపారు. ఒక మనిషికి ముఖ్యం తన ఆరోగ్యమే అని ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కటి అని దాన్ని కాపాడుకోవడం మన అవసరం అందుకే ప్రతిరోజూ ఒక గంట సేపు యోగా ఆసనాలు వేస్తే ఎన్నో రోగాలు దూరం అవుతాయి అని పేర్కొన్నారు. యోగాను మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికే పరిచయం చేశారు అని వేరే దేశాలలో కూడా యోగాను అనుసరిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని అన్నారు. చివరికి మన సంస్కృతి సాంప్రాయాలను కూడా ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి ఈ ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీ కే దక్కుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందుకు యోగా ఆసనాలు ప్రతిరోజూ ఉదయం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజం తయారు అవుతుందని ప్రతి ఒక్కరికీ భండారి శాంతి కుమార్ పిలుపునిచ్చారు. పిల్లల మర్రిలో ప్రారంభమైన యోగ అనుసంధానం, పాలమూరుకు మరింత చైతన్యం తెస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పుర ప్రజలు, విద్యార్థులు, యోగా సాధకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.