జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ
నవాబుపేట, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలో జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో ముద్దులకు, వికలాంగులకు మంగళవారం రూ వంద చోప్పున 117 మందికి పెన్షన్లు అందజేసినట్లు జెకె ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్ వి.నరసింహచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెన్షన్లు ఇవ్వడంతో వారికి కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ట్రస్ట్ సభ్యులు, ముద్దులు, వికలాంగులు, తదితరులు పాల్గొన్నారు.