వాకిటి శ్రీహరికి హోం శాఖ కేటాయించాలి

రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన వాకిటి శ్రీహరికి హోం శాఖ కేటాయించాలి

జడ్చర్ల రూరల్, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో బీసీ జాగృతి సేన మండలఅధ్యక్షులు గొడుగు నర్సిములు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశం లోబీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్ మాట్లాడుతు

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి 18నెలలు దాటినాప్రధాన పాత్ర వ హించే హోం శాఖ, సమాజ అభివృద్ధి కి మూలా ధారమైన విద్యా శాఖ లకు మంత్రులను నియమించకుండా నియంత పాలనకు తెర లేపా రని ప్రజా పాలనంటే ఇదేనా అని ముఖ్యమంత్రి తీరు పై మండి పడ్డారు. మా ఏడవ గ్యారంటీ సామజిక న్యాయమని పాలితులను పాలకులను చేయడమే మా ప్రభుత్వవిధానమని ప్రకటించిన ముఖ్యమంత్రి బీసీలకు జనాభా దామాషా ప్రకారం పాలనలో భాగస్వామ్యం కల్పించకుండా పార్టీ పదవు లు కేటాయించడమే సామాజిక న్యాయమా, పాలనా పరమైన నామినేటెడ్ పోస్టులకు బీసీలు అర్హులు కారా అని ప్రశ్నించారు. మంత్రి పదవులు పంపిణీలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి హోం శాఖ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో బీసీ జాగృతి సేన మండలఅధ్యక్షులు గొడుగు నర్సిములు, నియోజకవర్గం ప్రధానకార్యదర్శి లింగం పేట్ శేఖర్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, రైతు సంఘము జిల్లా అధ్యక్షులు గోపాల్, జిల్లా నాయకులు, మాచారం శ్రీనివాస్,, కట్ట మురళి, mrps నాయకులు బీమ్ రాజు, శివ శంకర్,మండలకార్యదర్శి, సురభి రఘు,మండప్రచారకార్యదర్శి రాములు, మండలసహాయ కార్యదర్శి చెన్నయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు,

Previous Post Next Post