ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం



జడ్చర్ల రూరల్, జూన్ 14 (మనఊరు ప్రతినిధి): మునిసిపల్ పరిధిలోని నాగసాల ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రోఫెసర్ జయశంకర్ బాడీ బాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల హెచ్ఎం జి. సావిత్రి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు ప్రదిప్ కుమార్ సామూహికంగా ముందుగా గణపతి పూజ, సరస్వతి మాతను సంకల్పం చేసుకొని, షోడశోపచార పూజ చేసి, అష్టోత్తరనామాలతో సరస్వతీమాతను ఆరాదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈవో మంజులదేవి హాజరై విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరంలో 15 మంది విద్యార్థులను కొత్తగా బడిలో చేర్చినందుకు పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాలలో ఒక పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు ప్రహరీ గోడ, రెండు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని ఎంఈఓని కోరినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నవనీత, ఉపాధ్యాయురాలు వి.సుమాదేవి, ఏఎపిసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Previous Post Next Post