*వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ అమావాస్య తిలతైలా అభిషేక పూజలు...

 *వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ అమావాస్య తిలతైలా అభిషేక పూజలు...

పరమశివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు

బిజినపల్లి, ఆగస్టు 23 (మనఊరు ప్రతినిధి): శ్రీ విశ్వవసు సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షం శనివారం అమావాస్య నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే తిల తైల అభిషేక,అర్చన, తదియ ప్రత్యేక పూజలు,అభిషేకాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థసప్త జ్యేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శని వారం శ్రావణ అమావాస్య తిథి నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు జరిగాయి.

ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తి పూర్వకంగా స్వామివారిని కొలచడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి,నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేషము ఫలితం ఉంటుంది. ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకపూజలు, అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య నిర్వహించారు.గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కెంచే రాజేష్ ప్రభాకరచారి, పుల్లయ్య, వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, మహిళలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






Previous Post Next Post