ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ డ్యాం బలి

 ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ డ్యాం బలి

 నవాబుపేట, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): దుందుభి నదిలో ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాల వల్ల వాగులు, వంకల్లో నిర్మించిన శాశ్వత నిర్మాణాలు కూడా శిథిలమవుతున్నాయి. నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కోసం ప్రభుత్వం వాగులు వంకల్లో చెక్ డ్యాంలు నిర్మించింది. ఇసుకాసురులు వాటి చెంతనే లోతుగా ఇసుక త్రవ్వకాలు జరిపి సొమ్ము చేసుకోవడంతో అవి శిథిలమవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండల పరిధిలోని కారూరు గ్రామ సమీపంలోని వాగులో గల చెక్ డ్యాం సోమవారం శిథిలమైంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Previous Post Next Post