జడ్చర్ల మండలంలో ఏకగ్రీవాల వెల్లువ

 జడ్చర్ల మండలంలో ఏకగ్రీవాల వెల్లువ

దేవునిగుట్టలో సర్పంచ్‌తో పాటు 8 వార్డులు ఖరారు

మొత్తం 52 వార్డులకు సింగిల్ నామినేషన్లు

జడ్చర్ల, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ముగియడంతో ఏకగ్రీవాల జోరు కనిపిస్తోంది. దేవునిగుట్ట గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవితోపాటు 8 వార్డులకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు కావడంతో ఆ స్థానాలు ఏకగ్రీవంగా ఖరారు కానున్నాయి. మండలవ్యాప్తంగా మొత్తం 52 వార్డులకు సింగిల్ నామినేషన్లు రావడం విశేషంగా మారింది. ఈ స్థానాలకు ఎలాంటి ప్రత్యర్థులు లేని నేపథ్యంలో ఏకగ్రీవాల జాబితాలో చేరాయి ఎంపీడీవో, ఎన్నికల అధికారులు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనడం, ప్రజా ప్రతినిధుల మధ్య పరస్పర అంగీకారం, గ్రామ పెద్దల సమన్వయం పెరగడం వల్లే ఈసారి భారీగా ఏకగ్రీవాలు నమోదవుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పలు గ్రామాల్లో అభ్యర్థులు ముందుగానే సామరస్యంతో ముందుకు రావడం కూడా ఏకగ్రీవాలకు దోహదపడుతుందని అన్నారు.

Previous Post Next Post