రక్తదానం మరొకరి ప్రాణదానం

 రక్తదాన శిబిరంలో 30 యూనిట్ల రక్తం సేకరణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్

నాగర్‌కర్నూల్, జనవరి 2 (మనఊరు ప్రతినిధి): రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడినట్లేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ శిబిరాన్ని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. హనుమంతు రావు, నాగర్‌కర్నూల్ జిల్లా లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ హాకీమ్ విశ్వప్రసాద్, అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సభ్యులు ప్రేమ్ కుమార్ రెడ్డి, మౌనిక రెడ్డి స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.

అలాగే జిల్లా యువశక్తి సభ్యులు, యువత, ఆసుపత్రి నర్సింగ్ అధికారులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 30 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసిన వైద్యులు, నర్సింగ్ అధికారులు, యువత, లయన్స్ క్లబ్ సభ్యులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. రక్తదాతలకు బ్లడ్ డోనర్ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏ. రోహిత్, లయన్స్ క్లబ్ ప్రాంతీయ సభ్యులు, జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, రాధాకృష్ణ, తేప్ప శ్రీనివాసులు, దర్శి రాజయ్య, లక్ష్మీ నరసింహ గౌడ్, యువశక్తి సభ్యులు మధు, నర్సింగ్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఆంజనేయులు గౌడ్, ఫయాజ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.



Previous Post Next Post