కన్నులపండువగా పాఠశాల వార్షికోత్సవం..

 కన్నులపండువగా పాఠశాల వార్షికోత్సవం..



ఉదయ మెమోరియల్ పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాలు

ఆడిపాడిన విద్యార్ధిని విద్యార్ధులు

 జడ్చర్ల రూరల్, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): ఉదయం మెమోరియల్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను ప్రిన్సిపల్ బాదిమి వీణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పట్టణంలోని చంద్ర గార్డెన్‌లో సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థుల విద్యార్థుల వివిధ రకాల ఆటపాటలతో ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నారు. అందులో భాగంగా డ్రామా జూనియర్స్ కలను ప్రదర్శించిన చిన్నారులు సామాజిక ప్రదర్శన, ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే అంశంపై విద్యార్థుల డ్రామా వేసి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాధిమి శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యాదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను పొందేందుకు అర్హత సాధించారు. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో ప్రతీ విద్యార్ధి చదువుపై దృష్టి సారించాలని ఈ కార్యక్రమంలో నాయకులు బాదిమి రవిశంకర్, బాదిమి దృవ, బాదిమి శశాంక్, సూరిశెట్టి పవన్, పాఠశాల విద్యార్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.

Previous Post Next Post