కూలిపోయిన విషాద సంఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి, జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి

 కూలిపోయిన విషాద సంఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి, జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి



కల్వకుర్తి, ఫిబ్రవరి 24 (మనఊరు న్యూస్): తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బిసి పైకప్పు కూలిపోయిన విషాద సంఘటన తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి నేత జాతీయ బిసి కమీషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల క్షేమం, భద్రత కోసం ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా జరిగిన సహాయ కార్యక్రమాలలో భాగంగా భారత ప్రభుత్వం రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తోంది. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ ఈ సహాయ చర్యల కోసం NDRF బృందాలను పంపింది. దీనితో పాటుగా ఇండియన్ ఆర్మీ కూడా సహాయ చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఈ ఘటన పట్ల విచారణ వ్యక్తం చేస్తూ సహాయ చర్యల గురించి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు.

Previous Post Next Post