రైతులు పీఎం కిసాన్ పథకం డబ్బులను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలి

రైతులు పీఎం కిసాన్ పథకం డబ్బులను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలి బిజినపల్లి, ఫిబ్రవరి 24 (మనఊరు న్యూస్): రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్న డబ్బులను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం ప్రభుత్వ ఉద్యోగి అన్నారు. సోమవారం ఆర్ఏఆర్ఎస్ పాలెం వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో పీఎంకిసాన్ 19 వ విడత డబ్బులను ప్రధానమంత్రి బీహార్ బాగులపూర్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాలెం అగ్రికల్చర్ కాలేజీ లో 150 మంది రైతులకు ఏర్పాటు చేసిన సమావేశానికి సోమవారం హాజరు కావడం జరిగింది. సమావేశం అనంతరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అతిధులు పీఎంకిసాన్ డబ్బులను రైతులు యే విధంగా వినియోగించుకుంటున్నారో ఎవరైనా రైతులు మాట్లాడాల్సిందిగా కోరారు. ఇందులో భాగంగా బిజినెపల్లి మండలం మామ్మయిపల్లె గ్రామానికి సంబందించిన రైతు తమ్మడి లక్ష్మయ్య మాట్లాడుతూ 2019 నుండి ఇప్పటి వరకు 18 విడతలు పీఎంకిసాన్ పడ్డాయి. ఈ డబ్బులు పంటలలో ఎరువులు పురుగు మందులు కొనుకోవడానికి వినియోగించుకుంటున్నాను అని తెలిపారు. ఈ పథకం చాలా మంచిగా ఉన్నది అని చెప్పడం జరిగింది. దీనితో సంతృప్తి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ అతిధులు లక్ష్మయ్యని సన్మానిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, వ్యవసాయ అధికారులు, వివిధగ్రామల రైతులు పాల్గొన్నారు.
Previous Post Next Post