పీఎం శ్రీ క్షేత్ర పర్యాటన చేసిన పాఠశాల విద్యార్దులు

 *పీఎం శ్రీ క్షేత్ర పర్యాటన చేసిన పాఠశాల విద్యార్దులు

 అడ్డాకుల, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్డాకుల విద్యార్థుల క్షేత్ర పర్యాటనలో భాగంగా మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం, తెలంగాణ గ్రామ వికాస్ బ్యాంక్ మరియు పోలిస్ స్టేషన్ న్ను సందర్శించారు. 


 రోజువారి కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు.  గ్రామ పంచాయితీలు వివరాలు పంచాయితీ విదులు, సిబ్బంది గ్రామ వివరాలు, ఆదాయ మార్గాలు తదితర గ్రామపంచాయతీ కార్యదర్శి సరస్వతిని విద్యార్థులు అడిగారు. తెలుసుకున్నారు.    గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించిన విద్యార్థుల బ్యాంకు కార్యకలాపాలు, డిపాజిట్ ఓచర్, విట్ డ్రా వడ్డీ వసూళ్లు ,తదితర వివరాల బ్యాంక్ మేనేజర్‌ను అడిగారు. తెలుసుకున్నారు.  కేసులు ఎలా నమోదు చేసి, విచారణ ఎలా జరుగుతారన్న విషయాలు మరియు ఎఫ్ ఐ ఆర్ నమోదు తదితర వివరాలను అడ్డాకుల పోలీస్ స్టేషన్ కు సందర్శించిన విద్యార్థులు ఎస్సై శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ సానుకూలంగా స్పందించి సమాధానాలు చెప్పారు.  కార్యక్రమంలో ఉపాద్యాయులు షమీ,జుర్రు నారాయణయాదవ్, చంద్రకళ, మంజుల, ఆంజనేయులు, భాస్కర్, 8వ తరగతి విద్యార్థులు ఉన్నారు.

Previous Post Next Post