బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభను జయప్రదం చేద్దాం..
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలుకతుర్తి గ్రామంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవసభను జయప్రదం చేద్దామని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈనెల 27న మన ఇంటి పార్టీ పండుగకు స్వచ్ఛందంగా తరలివచ్చి, విజయవంతం చేద్దామని సూచించారు. ఈ సందర్భంగా చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సభలో పార్టీ అధినేత కెసిఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యచరణకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.