శ్రీ దత్త సాయికి ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదానం

 శ్రీ దత్త సాయికి ప్రత్యేక పూజలు

 భక్తులకు అన్నదానం 

చిలకలూరిపేట, ఏప్రిల్ 17 (మనఊరు ప్రతినిధి): చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్త సాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం భక్తులకు దాతల సహాయ సహకారాలతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. దత్త సాయి సన్నిధి నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టిన వారికి సద్గురు అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి అని తెలిపారు. దత్త సాయి సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, అయినవోలు హనుమంతరావు, మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post