సందడి చేసిన wow మ్యూజిక్.....
హైదరాబాద్, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): గాన గాంధర్వ బాలు సంగీత రారాజు ఇళయరాజా జన్మదిన వేడుకలు సందర్భంగా WOW మ్యూజిక్ ఫౌండర్, చైర్ పర్సన్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమం కొనసాగినది, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ఇళయరాజా సంగీతంలో కె.వి.మహదేవన్, రాజు కోటి చక్రవర్తి ఇలా అనేక సంగీతాన్ని సమకూర్చిన సంగీత సామ్రాట్ లతో మరియు పి సుశీల జానకమ్మ గార్లతో తన గానాన్ని ఆలపించిన బాలు పాటలను ఎన్నుకొని ఈ కార్యక్రమంలో ఒక సాంప్రదాయ బద్ధమైన పద్ధతులు పాటలను ఎంచుకొని గాయనీ గాయకులు పాడటం జరిగినది,"కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అనే పాటని టైటిల్ సాంగ్ గా ఎన్నుకొని అలాంటి పాటలకు దగ్గరగా ఉన్నా పాటలను ఆలపించడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజికవేత్త తెలంగాణ సిఎస్సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ అంజనీకుమారిని ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా అంజనీ కుమారి మాట్లాడుతూ సంగీతము సాహిత్యం నాట్యము ఈ మూడు మానవ సంబంధాలతో ముడిపడి ఉంటాయి, మనము రోజువారి కార్యక్రమాల్లో కొంత టైం వీటికి కేటాయించి కొంత ప్రాక్టీస్ చేస్తే మన గాత్రంతో ఆలపించి సభను ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగించగలము, ప్రేక్షక మహాశయులను ఇంకా మెరుగైన సంగీతాన్ని మన గాత్రం ద్వారా అందించగలము అన్నారు, ఈ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా కొనసాగించిన ఆర్గనైజర్ మరియు ఫౌండర్ , చైర్ పర్సన్ గాయని శ్రీమతి వెంకటలక్ష్మి గారు WOW మ్యూజిక్ స్థాపించి అనేకమంది గాయని గాయకులకు వారిలో ఉన్న నైపుణ్యాన్ని సంగీతము ద్వారా నేటి గాయని గాయకులకు ఒక ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం చేస్తూ వారిలో ఉన్న నైపుణ్యానాని వెలుగులోకి తీసుకొస్తూ తమ వంతు కృషి చేస్తున్నారు, అని అన్నారు, ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా శ్రీనివాసరావు, సమన్వయ కర్తగా సిరిలు వ్యవహరించినారు, ప్రముఖ గాయనీ గాయకులు సుబ్బరాజు, మురళి గారు వెంకట్ కుమార్, ప్రశాంత్, నరేష్ నరేష్, భాస్కర్, జాబీర్ హుస్సేన్ గారు, ప్రశాంత్ గారు, వెంకటేశ్వర్లు గారు, మరియు రమణారెడ్డి గారు, తమ గానంతో ఈ కార్యక్రమాన్ని గాన గాంధర్వ బాలసుబ్రమణ్యం గారి పాటలతో ముందుకు కొనసాగినారు , మరియొక అతిధి ఆలూరి ఫౌండేషన్ అధినేత ఆలూరి విల్సన్ ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటలక్ష్మి గారితో మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకుల తో కలిసి తన గాత్రంతో ఆలపించి సభను ఉత్సాహ పరిచి, కొత్తగా వస్తున్న గాయని గాయకులకు స్వాగతం పలికి వెంకటలక్ష్మి గారు మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని కొత్తవారికి అవకాశాన్ని కల్పించాలని కోరినారు, ఆత్మీయ అతిధులుగా విచ్చేసిన ఇందిరా ఫౌండేషన్ అధినేత శ్రీమతి ఇందిరా గారు మరియు రాగ రంజని శ్రీమతి నాగమణి గారు మరియు రమణి గారు మరియు వెంకటలక్ష్మి గారు ఇలా అనేకమంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గాయని గాయకులు తమ గాత్రంతో ఇళయరాజా గారి సంగీతం లో కె.వి.మహదేవన్ మరియు చక్రవర్తి అనేక ప్రముఖుల సంగీతంలో బాలు ప్రత్యేకంగా పాడిన పాటలను పాడి ఈ సభను ఉత్సాహంగా కొనసాగించినారు,,"Wow అంటే WoW అనే విధముగా ఈ కార్యక్రమం కొనసాగినది, కళాభారతి చిక్కడపల్లి కల్చరల్ సెంటర్ నందు 03-06-2025 తారీకున మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగినది.