సీసీ రోడ్డు పనులు పరిశీలించిన నాయకులు

 సీసీ రోడ్డు పనులు పరిశీలించిన నాయకులు 

జడ్చర్ల రూరల్, జూన్ 14 (మనఊరు ప్రతినిధి): మునిసిపల్ పరిధిలోని 3వ వార్డ్ లోని వెంకటేశ్వర కాలనీ ఫేసు1 లోని వివిధ కాలనీలలో  రూ ఒక కోటి 14 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్లు పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంత కిషన్ తో పాటు నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం, కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రోడ్ల కోసం రూ ఒక కోటి 14 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనుల కోసం మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాఘవేందర్, హనుమంత్ రెడ్డి, కృష్ణయ్య, చంద్రమౌళి, కోదండరామయ్య, శ్రీనన్న, కృష్ణయ్య, అనిల్,  సన్నీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post