*యోగాతో శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది.*
నాగర్ కర్నూల్, జూన్ 21 (మనఊరు ప్రతినిధి): మన ఆరోగ్య పరిరక్షణకు మన పూర్వీకులు పురాతన కాలంలో నే మనకు పలు మార్గదర్శకాలు సూచించారని,అందులో యోగ, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదము,వంటివి ఎంతో శ్రేష్టమని జిల్లా యునాని వైద్యాధికారి డాక్టర్ షాబాజ్ మాలిక్ అన్నారు,అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురస్కరించుకుని శనివారం నాడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి, జిల్లా కోర్టు ఆవరణ లో వివిధ పాఠ శాలల్లో యోగాడే ఉత్సవాలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యోగను ప్రతి ఒక్కరూ దినచర్యగా అలవరుచు కావాలని, యోగ వల్ల మనిషియొక్క ఆరోగ్యస్థాయి పెరగడంతో పాటు రోగాల బారిన పడకుండా ముందస్తుగా మెడిసిన్ వలె పనిచేస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో యోగ శిక్షకులు రవీందర్, ఫార్మాసిస్ట్ మురళి కృష్ణ, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి, నర్సింగ్ అధికారులు రాజు, సరస్వతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.