పెద్ద మోరీలలో మట్టి, చెత్తను తొలగించి శాశ్వత పరిష్కారం చూపించాలని తహసీల్దార్ కు వినతి
జడ్చర్ల రూరల్, జూన్ 11 (మనఊరు ప్రతినిధి): చిన్నపాటి వర్షం వచ్చినా నల్లకుంట నుంచి వర్షం నీరు ప్రధాన రహదారి అమర్ కృష్ణ లాడ్జీ ముందర నీరు నిలిచిన చెరువు ను తలపిస్తూ ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని బుధవారం నయాబ్ తహశీల్దార్ మహబూబ్ అలీకి బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో వినతిపత్రం ఒక. ఈ సందర్భంగా బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ చిన్నపాటి వర్షం వచ్చిన బాదేపల్లి పట్టణంలోని నల్లకుంట నీరు అమర్ కృష్ణ లాడ్జీ ముందర నీరు నిలిచి చెరువును తలపిస్తూ ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నీరు మలిచిన ప్రతిసారి సంబంధిత అధికారులు తూతూ మంత్రంగమరమ్మతులు చేపట్టి తాత్కాలిక అనుమతి ఇస్తున్నారు, తప్ప శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడం లేదు కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇట్టి సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పెద్దపాటి వర్షాలు ప్రారంభం కాకముందే స్థానిక ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి పునరావసంకల్పించి, నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని
పెద్ద మోరీలలో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను, ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన మండలఅధ్యక్షులు గొడుగు నర్సిములు, కార్మికవిభాగం, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కుర్వగడ్డ పల్లి గోపాల్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గంగాపూర్ భీమరాజ్, మండల ప్రచార కార్యదర్శి కావాలి రాములు, పట్టణ అధ్యక్షులు శివరాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, చంద్రమౌళి, రమేష్ తర్వాత.