*ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పి పి యూనిట్ సేవలు ఆకస్మిక తనిఖి*
గర్భిణీలు, వైద్య సిబ్బంది హెల్ప్ డెస్క్ సేవలు వినియోగించుకోవాలి.
ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డాక్టర్ ఎం.వెంకట్ దాస్.
నాగర్ కర్నూల్, జూన్ 21 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గది నెంబర్ 22 లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా నిర్వహిస్తున్న పీపీ యూనిట్ ద్వారా గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు అందిస్తున్న ఆరోగ్య సేవలను, సిబ్బంది పనితీరును శనివారం నాడు ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకట దాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. నవజాత శిశువులకు, చిన్నారులకు ఇస్తున్న సార్వత్రికల టీకాల పంపినీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి శిశువుకు 24 గంటల్లోపే తప్పనిసరిగా బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో వ్యాక్సిన్ లను అందించాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్ నిల్వ చేస్తున్న తీరును, శతలీకరణం పరిస్థితిని వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అభిరామ్ వివరించారు. వ్యాక్సిన్ పంపిణీ, నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది జిల్లా సాధారణ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హెల్ప్ డెస్క్ సేవలను ఇతోదికంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి హైరిస్కు కేసును వైద్యాధికారులు హైరిస్కు గ్రూపులో గర్భిణీ యొక్క వివరాలను తెలియజేసి 24 గంటల పాటు గర్భవతులను సుఖ ప్రసావాలు అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.హెల్ప్ డెస్క్ సేవలకు 9014932408 లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అభిరామ్, పర్యవేక్షకులు మరియమ్మ, వనిత, ఆరోగ్య కార్యకర్తలు నర్సింగమ్మ, కల్పన, సునీత హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.