సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యం

 సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యం

ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 

మూడు రోజుగా విజయవంతంగా 79 మంది కంటి శుక్లాల పేషెంట్లకు సర్జరీలు పూర్తి...

450 కి పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి










కల్వకుర్తి, జులై 10 (మనఊరు ప్రతినిధి): అంధత్వ సంపూర్ణ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం‌ కల్వకుర్తి పట్టణంలోని సికెఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ వారిచే 6వ రోజు కొనసాగుతున్న ఉంచిత కంటి పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి కం టి పరీక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సంపూర్ణంగా అంధత్వ నిర్మూలనకై కృషిచేస్తున్నామని, నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిభిరం సేవలు పెద్ద ఎత్తున పేద ప్రజలకు చేరువైతున్నాయని, ఇప్పటివరకు ఆరు రోజులుగా 5000మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా,వారిలో 2600 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని,వాటిలో 170 మంది పేషెంట్లను కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక చేశామని,వీరిలో 79 మంది పేషెంట్లకు విజయవంతంగా సర్జరీలు పూర్తి చేశామని, ఆరు రోజులుగా 2000 కి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని తెలియజేస్తూ, రేపటితో ముగియనున్న కంటి పరీక్షల సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు, గణేష్, రఘు, యాదయ్య, శ్రీపతి, శేఖర్, శ్రీను, నాగిళ్ల శివ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఉంచిత కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో 1100 మందికి పైగా కంటి శిబిరాన్ని సందర్శించగా 700 కి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు, గణేష్, రఘు, యాదయ్య, శ్రీపతి, శేఖర్, శ్రీను, నాగిళ్ల శివ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post