పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

జడ్చర్ల, జులై 13 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో 2004- 2006 విద్యా సంవత్సరంలో బైపీసీ చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మే ళనం నిర్వహించారు. సుమారు 20 సంవత్స రాల తర్వాత అందరూ ఒక వేదికపై వచ్చి గతస్మృతులను నెమరవేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆనాడు చదివిన విద్యార్థులు నేడు విద్యారంగం, సాంకేతిక రంగం, వైద్యం, రాజకీయాలు, తదితర విభాగాల్లో స్థిరపడ్డారు. 

20 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకుని అపూర్వమైన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సమ్మేళనంలో 40 మంది విద్యార్థులు, ఆనాడు బోధన చేసిన ఉపన్యాసకులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థులు కొందరు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, గత జ్ఞాపకాలను పునఃస్మరించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆనాడు బోధించిన ఉపన్యాసకులు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. విద్యార్థులతో సంతోషంగా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ జీవిత ప్రయాణాలు, విజయాలు, మరియు కళాశాలలో నేర్చుకున్న చదువు వల్ల వచ్చిన మార్పును నేడు గుర్తు చేసుకుంటూ సంతోషపడ్డారూ. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నృత్యం, చిన్న చిన్న ఆటలతో సందడి చెలరేగింది. చివరగా, పూర్వ విద్యార్థులు ప్రతిసారీ ఇలా సమ్మేళన కార్యక్రమం నిర్ణయించుకోవాలని నిర్ణయించుకున్నరూ. ఈ కార్యక్రమంలో నాడు విద్యాబోధన చేసిన ఉపన్యాసకులు యాదగిరి, రాజేంద్ర సాహెబ్, చంద్రశేఖర్ రెడ్డి, ఐసాక్, సురేష్ రామకృష్ణ, శేఖర్, సుభాషిని, జానకిరాములుగౌడ్, పూర్వ విద్యార్థులు రాధాకృష్ణ, శివకుమార్, రవికుమార్, సుభాష్ చంద్రబోస్, భరత్, సుజాత, చందన, రమ్య, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post