*దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కానుక*
*దేశంలోని, మధ్యతరగతి పేద కుటుంబాలకు లాభం చేకూర్చేలా కొత్త జీఎస్టీ రేట్లు ప్రధాని మోదీజీ*
*కొత్త జీఎస్టీ స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి*
మిడ్జిల్, ఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకగా ′పేద, తరగతి కుటుంబాలకు లాభం. చేకూర్చేలా కొత్త జీఎస్టీ ప్రవేశపెడుతున్నామని దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్న 90 శాతం ఉత్పత్తులకు 18 శాతం తగ్గడంతోపాటు 12 శాతం ఉంది ఉత్పత్తులకు కేవలం 5 శాతం కుదించేలా బిజెపి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించిందని వారి ప్రసంగంలో తెలియజేశారు. ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, బైక్లు, ఇతర రోజు వారి వస్తువులపై భారీ తగ్గింపు ఉండనున్నదని ప్రధాని మోడీ తెలియజేశారు. అలాగే ప్రతి భారతీయుడు మన రోజువారి దినచర్యలో మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుగోలు చేస్తే దాని ద్వారా దేశం ప్రయోజనాలను, దేశ ఆర్థిక ప్రగతిని సాధించిన వారిమౌతాం అలాగే ప్రతిరోజు భారతదేశంపై విషం చిమ్మే ఇతర దేశాలకు కూడా సరైన బుద్ధి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంద్రాగస్టు నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.