తొలితరం విప్లవ వీరుడు పాపన్నగౌడ్

 తొలితరం విప్లవ వీరుడు పాపన్నగౌడ్ 

సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్

జడ్చర్ల రూరల్, ఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి): ఆత్మగౌరవ పోరాటంలో తొలితరం విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్ అని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు. సోమవారం మండలంలోని నస్రుల్లాబాద్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత వృత్తి చేసుకొని జీవించే పాపన్న నవాబుల పాలనలో రజాకార్ల ఆగడాలపై ఎదురుతిరిగి గెరిల్లా సైన్యంతో ఒక్కో కోటను స్వాధీనం చేసుకున్నాడన్నారు. పాపన్న చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు.

 సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మొఘల్ సామ్రాజ్యవాదులతో పోరాడి గోల్కొండ కోటను జయించి రాజ్య స్థాపన చేశారన్నారు. ఆర్థిక బలం ధన బలం పూర్వ రాజరిక వ్యవస్థ నుంచి రాకున్నా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తన సొంతంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పరచుకొని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నుంచి గోల్కొండ కోటను జయించడం జరిగిందని తెలిపారు. జమీందారులు, దొరలు, భూస్వాములు, తాబేదారుల అరాచకాలను అణిచివేసేందుకు ఉద్భవించిన మహా వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని తెలియజేశారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటపటి మన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి బడుగు బలహీన వర్గాల వారు ఐక్యతగా ఉండి తమ హక్కుల కొరకు పోరాటం చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో శంకరయ్యగౌడ్, నాగయ్యగౌడ్, చంద్రశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post