జనవరి 2న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం
యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్. వి. శేఖర్
నాగర్కర్నూల్, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో 2026 జనవరి 2న ఉదయం 10 గంటలకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్ తెలిపారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రతినెల ప్రసవాలకు వచ్చే గర్భిణీలు, ఆర్థోపెడిక్ సర్జరీ రోగులు, సాధారణ శస్త్రచికిత్స రోగులు, రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు సుమారు 200 బ్లడ్ యూనిట్ల అవసరం ఉంటుందని ఆయన వివరించారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యువత, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక యూనిట్ రక్తాన్ని దానం చేయాలని ఆయన కోరారు. రక్తదానం చేసిన దాతలకు ప్రత్యేక సర్టిఫికెట్తో పాటు పండ్లు, జ్యూస్ అందజేస్తామని తెలిపారు. గతంలో రక్తదానం చేసిన వారు కూడా ఈ శిబిరంలో మళ్లీ రక్తదానం చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని సహకరించాలని డా. శేఖర్ విజ్ఞప్తి చేశారు.శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాలకు హెల్ప్డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి సెల్ నెంబర్: 90149 32408ను సంప్రదించాలని సూచించారు.
