వడ్డేమాన్ లో శనేశ్వర గ్రహదోష పూజలు....

వడ్డేమాన్ లో శనేశ్వర గ్రహదోష పూజలు....

బ్రహ్మసూత్రము గల పరమశివునికి ప్రత్యేక అభిషేక పూజలు

బిజినెపల్లి, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): శ్రీ విశ్వవసు సంవత్సరం మార్గశిర మాసం కృష్ణ పక్షం విదియ శనివారం నాడు మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహ దోష నివారణకు స్వామి వారికి తిలతైలా అభిషేకలు భక్తితో వైభవంగా జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జన్మ రిత్యా గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని అన్నారు.స్వామివారిని కొలవడంతో విశేష ఫలితం ప్రాప్తిస్తుందని అన్నారు. భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితం ఉంటుందన్నారు.ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు,అర్చనలు, దీపారాధన నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.






Previous Post Next Post