టియుడబ్ల్యుజెతోనే జర్నలిస్టుల సంక్షేమం
- ఐజెయు నిరంతరం జర్నలిస్టుల పక్షాన పోరాటం
- త్వరలోనే యూనియన్ నుంచి హెల్త్ క్యాంపు, శిక్షణ తరగతులు
- టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
- యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
- అధ్యక్ష, కార్యదర్శులుగా నాగరాజుగౌడ్, సతీష్ రెడ్డి
మహబూబ్ నగర్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): టియుడబ్ల్యుజే (ఐజెయూ)గత 70 ఏళ్లుగా నిరంతరంగా జర్నలిస్టుల పక్షాన్నే పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ పునరుద్ఘాటించారు. మహబూబ్జి నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాసభ ను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ లో ఒకరు గొప్ప మరొకరు తక్కువ అని ఉండదన్నారు. యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని, జర్నలిస్ట్ ల కోసం వారి సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేయాలన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అనంతరం ఎన్నికల అధికారి బాలస్వామి మాట్లాడుతూ జిల్లా కమిటీ ఏకగ్రీవం చేసేందుకు అందులో భాగస్వములైన అందరికి ధన్యవాదాలు తెలిపారు. నూతన కమిటీ బాగా పని చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని కృషి చేయాలన్నారు. ఇండ్లు రాని జర్నలిస్ట్ ల పక్షాన పోరాడాలని కోరారు.
ప్రశాంత్ మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా ఉమ్మడి జిల్లాలో కమిటీ లు, మహాసభలు నిర్వహించినట్లు తెలిపారు.
సమిష్టిగా ఏకగ్రీవం చేసినందుకు సంతోషంగా లో ఉందని యూనియన్ జిల్లా మాజీ అధ్యక్షుడు దత్తు మాట్లాడారు.
మహాసభ కన్వీనర్ కేఏ విజయరాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*నూతన కార్యవర్గం ఏకగ్రీవం*
కాటం నాగరాజు..
టీయూడబ్ల్యూజె (ఐజె యు) జిల్లా అధ్యక్షుడు
టీయూడబ్ల్యూజె (ఐజె యు) జిల్లా ప్రధాన కార్యదర్శి


