జిల్లా వీరశైవ లింగాయత్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కెంచే రాజేష్ కుమార్

జిల్లా వీరశైవ లింగాయత్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కెంచే రాజేష్ కుమార్


నాగర్‌కర్నూలు, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ప్రధాన కార్యదర్శిగా కెంచే రాజేష్ కుమార్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు కొండ వీరన్న అధ్యక్షతన గురువారం నిర్వహించిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కెంచే రాజేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని, కుల సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో సంఘాన్ని చురుకుగా పాల్గొనేలా చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Previous Post Next Post